PPM: ఈనెల 24న జిల్లా క్రీడా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె. శ్రీధర్ రావు బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శాప్ లీగ్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు జిల్లాలోని క్రీడాకారులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో 24వ తేది ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయన్నారు.