KKD: కార్తీక మాసం ముగింపు పురస్కరించుకుని అమావాస్య కావడంతో సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో అఖండ కోటి దీపారాధన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ఆలయంలో ప్రమిదలతో దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.