AKP: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రైతు సంక్షేమ పథకాలు వర్తించాలంటే విశిష్ట గుర్తింపు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. విశిష్ట గుర్తింపు నమోదుకు శనివారం సాయంత్రం వరకు గడువు ఉందన్నారు. ఫోన్ నెంబర్, ఆధార్, పట్టాదారు పాసుబుక్ జిరాక్స్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.