KKD: పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో బుధవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ రైతు కళ్లాలను సందర్శించారు. వరి కోత యంత్రాల పనితీరు, కోత అనంతరం ధాన్యం తేమ శాతం వ్యత్యాసాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. జిల్లాలో రబీ కోత పనులు జోరుగా సాగుతున్నాయని, ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని జేసీ తెలిపారు.