ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు మామిళ్ళపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ ఏఈవో మాధురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పంట పొలాల్లో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.