VZM: డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం బాడంగి మండలంలో ఎత్తుకానా సమీపంలో నాబార్డ్ సహకారంతో నిర్వహిస్తున్న FCC బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు బెల్లం తయారీలో సాంకేతిక సలహాలు ఇవ్వడంలో DCCB ఎప్పుడు ముందు ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సమీపంలోని దీక్షా మహిళా వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని సందర్శించి పలు సూచనలు చేసారు.