మార్కాపురంలోని కందుల నారాయణ రెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పొదిలి మండలం కుంచెపల్లి గ్రామానికి చెందిన వరికుంట్ల పౌలు, వరికుంట్ల వినోద్ ఆధ్వర్యంలో సుమారు 15 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.