సత్యసాయి: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూరు క్రాస్ రోడ్ వద్ద సీఐ జనార్ధన్, ఎస్సై సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం మానుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.