E.G: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ కార్యక్రమం నవంబర్ 10న సోమవారం యథాతధంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకు లోనుకాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ–వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందవచ్చని ఆమె సూచించారు.