TPT: రేణిగుంటలో ఆలయానికి తీసుకెళ్తామని నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసి దోపిడీ చేసిన ఘటన బయటపడింది. కడప జిల్లా రాజంపేటకు చెందిన వ్యక్తితో పరిచయం పెంచుకున్న ఇద్దరు, అతన్ని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి బైక్, మొబైల్, నగదు, వెండి గొలుసు దోచుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.