ATP: కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును విద్యుత్ శాఖ నూతన ఈఈ కళ్యాణ్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని, ముఖ్యంగా రైతులకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను ఎప్పటికప్పుడు సరఫరా చేసి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.