సత్యసాయి: కదిరి ఈద్గా ఖబరస్తాన్లో 55 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, ఐమాక్స్ లైట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. ముస్లిం మత పెద్దలతో కలిసి అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు. రెండేళ్లలో షాదీ మహల్ పూర్తి చేసి పేదలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.