BPT: సంతమాగులూరులోని వెలుగు కార్యాలయంలో ఈ నెల 9న జనగణ సర్వేపై శిక్షణా తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. శిక్షణా తరగతులు నేటితో ముగిశాయి. సిబ్బంది అలసత్వం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేయాలని తహసీల్దార్ కే. రవిబాబు ఆదేశించారు. సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే తెలియజేయాలని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బందికి సమయపాలన పాటించాలని తెలిపారు.