కృష్ణా: కైకలూరులోని గాంధీ బొమ్మ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు పాటు ఆమరణ దీక్ష చేసిన ఆయన పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యసంఘ క్యాలెండర్ ఆవిష్కరించారు.