VZM: గజపతినగరంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ఎదురుగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ స్థలాన్ని డీసీసీబీ ఛైర్మన్ డాక్టర్ కిమిడీ నాగార్జున పరిశీలించారు. ఈ మేరకు సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. డీసీసీబీ సీఈవో ఉమామహేశ్వరరావు, జీఎం వాసు, డీజీఎం ప్రసాదు, సొసైటీ సీఈవో నారాయణరావు పాల్గొన్నారు.