వినుకొండకు చెందిన యువకుడు నదిలోని ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. బీటెక్ విద్యార్థి గర్రె వెంకట ఈశ్వర్ సాత్విక్ (21) తుళ్లూరు పరిధిలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు శుక్రవారం స్నేహితులతో కలిసి రాయపూడి లాంచ్ రేవు వద్ద ఈతకు నదిలో దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. మత్స్యకారుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.