SKLM: నరసన్నపేట మండలం గోపాలపెంట గ్రామానికి చెందిన బబ్బోది పెంటమ్మ, బుడుమూరు అమ్మడమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువనేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆదివారం వారిరువురిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు ఎంపీటీసీ మల్లేశ్వరరావు, తదితరులు ఉన్నారు.