కృష్ణా: రాష్ట్ర అభివృద్ధి, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ మంగళవారం ట్వీట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పోలవరం ప్రాజెక్టును పక్కా ప్రణాళికతో ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఉమ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఉమ Xలో పేర్కొన్నారు.