E.G: గోకవరం మండలం గంగంపాలెం ప్రభుత్వ ఎం.పీ.యు.పీ. పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ శిబిరంలో అప్తాలమిక్ ఆఫీసర్ సీహెచ్. ఆనందరావు 105 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆరుగురు విద్యార్థులకు దృష్టిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.