ELR: జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీని శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్లతో కలిసి ఏలూరు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇందనం పొదుపుపై అవగాహన కలిగించే పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఇందనాన్ని పొదుపు చేయడం ద్వారా భావి తరాలకు మంచి భవిష్యత్ను ఇవ్వవచ్చని అన్నారు.