W.G: వచ్చే ఐదేళ్లలో అన్నదాతను రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. మంగళవారం మండలంలోని రామన్నపాలెం, కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాల్లో నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.