TPT: కలెక్టర్ ఆదేశాలతో గృహనిర్మాణ సంస్థపై గురువారం ప్రత్యేక విచారణ జరిగింది. అర్హులు కాకుండా కొందరికి ఇళ్లు మంజూరు చేశారన్న ఆరోపణలు, నిర్మాణం పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారన్న ప్రస్తావనకు వచ్చాయి. 10 నెలలుగా విచారణ కొనసాగుతున్నప్పటికీ తుది నిర్ణయం రాకపోవడంతో అర్జీదారు అసహనం వ్యక్తం చేశారు. అర్హులకే ఇళ్లు మంజూరు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.