PLD: మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మాచవరం సచివాలయంలో గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు పలు రకాల వ్యాధుల గురించి ఆ గ్రామాల వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమం మహిళల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించామని ఎంపీడీవో విష్ణు చిరంజీవి అన్నారు.