VSP: భారతదేశం అత్యుత్తమ మేధో సంపదకు నిలయమని ఐఐటి ఖరగ్పూర్ పూర్వ ఆచార్యుడు ఎం.ఆర్. మాధవ్ అన్నారు. ఏయూలో సోమవారం నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను భారత్ సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. మానవ మేధస్సుతో అసాధ్యాలను కూడా సాధ్యంగా మార్చవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జియోసూత్రాస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.