ASR: అరకులోయ తహసీల్దార్ కార్యాలయాన్ని ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరాం గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి, అర్హులైన గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కుమారస్వామికి సూచించారు.