ELR: ఆపదలో ఉన్న మహిళలు, బాలికలకు ఒక్క క్లిక్తో పోలీసుల సాయం అందుతుందని ఏలూరు త్రీ టౌన్ సీఐ కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఏలూరు బాలికల వసతి గృహంలో ‘శక్తి యాప్’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఫోన్లలో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని, అత్యవసర సమయాల్లో ‘SOS’ బటన్ క్లిక్ చేసి పోలీసుల తోడ్పాటు పొందాలని సూచించారు.