KDP: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం కడప నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సీ.)గా బాధ్యతలు స్వీకరించిన రాకేష్ చంద్రం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. నగర అభివృద్ధి, పారిశుధ్యం, పౌర సేవలపై పరస్పరం చర్చించినట్లు తెలిసింది.