GNTR: గురజాల పట్టణంలోని ప్రధాన రహదారుల్లో శ్రీ త్రిపురాంతక లుంబినీ పిరమిడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానవులు ప్రతి ఒక్కరూ మాంసాహారం వద్దు శాఖాహారమే తినాలి అంటూ శాఖాహార మద్దతుదారులు ప్లకార్డులతో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖహారులు మానవులు ఏ జీవిని చంపే హక్కు లేదు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.