ASR: గూడెంకొత్తవీధిలో ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు ఎంపీడీవో రమణబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని 16 పంచాయతీల్లో పథకం ద్వారా జరిగిన పనులపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.