CTR: టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి BR నాయుడుని వెంటనే తొలగించాలని చిత్తూరు మాజీ MP రెడ్డప్ప డిమాండ్ చేశారు. శనివారం పుంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. శ్రీవారి ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్యాడర్ పాల్గొన్నారు.