ASR: అన్నదాత సుఖీభవ పధకం 3వ విడతలో అనంతగిరి మండలంలో 8257 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎంఏవో రంగారావు గురువారం తెలిపారు. 8257 మంది రైతులకి అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతలో రూ. 4000, 22వ విడత పీఎం కిసాన్ పథకం కింద రూ. 2,000 లబ్ధి వారి ఖాతాలకు జమ అవుతుందన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పధకాల కింద మండలానికి మొత్తం రూ.4.95 కోట్ల లబ్ధి అందుతుందన్నారు.