అన్నమయ్య: రాయచోటిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీనియర్ రిపోర్టర్ పూడి శ్రీహరి అరెస్ట్ అప్రజాస్వామికమని పేర్కొంటూ, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో భారీ వ్యయాలు చేసి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు.