KRNL: ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న శేఖర్ (55) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. రా. 8 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. 1997 నుంచి 29 ఏళ్ల పాటు సంస్థకు విశేష సేవలు అందించిన శేఖర్, ఉత్తమ డ్రైవర్గా పలు అవార్డులు అందుకున్నారు.