KDP: ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె సమీపంలో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అధికారుల బృందం రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బద్వేల్ నుంచి జమ్మలమడుగుకు ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తుండగా విజిలెన్స్ బృందం పట్టుకుని స్థానిక రెవెన్యూ పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సుమారు 120 బియ్యం బస్తాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.