కృష్ణా: పెనమలూరు (M) తాడిగడప జిల్లా పరిషత్ హై విద్యార్థులు బుధవారం అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు. చట్ట సభల్లో చట్టాలను రూపొందించడం, అమలు పరచడం, సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించే తీరును స్వయంగా వీక్షించడంత విద్యార్థులు అనుభూతి చెంది తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బోదే ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.