ASR: ఉచిత బస్సు పథకం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని దేవీపట్నం ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ.. ఈ పథకం వల్ల ఆటోలలో ఎవరు ప్రయాణం చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.