WG: ఆచంట, పెనుగొండ మండలాల నుంచి ఆరు నెలల క్రితం ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లిన 20 మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెప్పిన పని కాకుండా వేరే పనులు చేయిస్తూ.. వేధిస్తున్నారని బాధితులు వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశానికి రావాలంటే రూ.1 లక్ష కట్టాలని ఏజెంట్ డిమాండ్ చేస్తున్నాడని, ప్రభుత్వం స్పందించి తమను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.