ELR: పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, ఇందులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఒక్కో ఉద్యోగానికి రూ. 15 లక్షలు వసూలు చేశారని, అభ్యర్థుల మార్కులను కూడా రహస్యంగా ఉంచారని మండిపడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.