VZM: ఈనెల 29వ తేదీన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సత్యనారాయణ తెలిపారు. సర్వసభ్య సమావేశం ఆరోజు ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సభ్యులు, అధికారులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.