NDL: 30 రోజులలో శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. రూ.7,19,58,064 నగదు రాబడిగా లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. 122 గ్రాముల బంగారు, 6 కేజీల వెండి, విదేశీ కరెన్సీ లభించిందని, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.