ప్రకాశం: రాష్ట్ర అవతరణ కోసం ప్రాణం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని ఎర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ఆదివారం తమ పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.