KDP: ఇంటర్మీడియట్ ఫలితాల్లో పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు శ్రీజ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 411 మార్కులతో, సుస్మిత ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 950 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ క్రమంలో కళాశాల సిబ్బంది వారిని అభినందించారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు.