KDP: రాజంపేట మండలం ఎస్.ఎర్రబల్లి దొంగతనం కేసును మన్నూరు పోలీసులు చేధించి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.9 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చెన్నై తిరువళ్ళూరుకు చెందిన గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే వెల్లడించారు.