AKP: తిమ్మాపురం పంచాయతీ పరిధిలో విద్యుత్ స్తంభాలు, వైరుకు కలిపి రూ.1.90 లక్షలు విద్యుత్ శాఖకు కట్టినా ఇప్పటివరకు పనులు జరగలేదని గ్రామ మాజీ సర్పంచ్ కె సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వీధిలైట్లు సౌకర్యం కోసం కట్టి రెండు నెలలు దాటుతున్నా సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.