తిరుపతి: అలిపిరి సమీపంలోని వేదిక్ వర్సిటీ ఆవరణలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. కొన్ని రోజులుగా రాత్రివేళల్లో ప్రధాన రోడ్ల వెంబడి తిరుగుతుండటాన్ని సీసీ కెమెరాల సాయంతో సిబ్బంది కనిపెట్టారు. విషయం తెలిసి వర్సిటీ విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.