సత్యసాయి: ధర్మవరంలోని ఎన్డీయే కార్యాలయంలో RWS, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత తప్పక పాటించాలని సూచించారు.