KRNL: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలు సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన కళాకారులు ప్రతిభ చాటుకుని పురస్కారాలు అందుకోవడం గర్వకారణమని MLA జయనాగేశ్వర రెడ్డి ఇవాళ అన్నారు. డ్రామా విభాగంలో అవార్డు సాధించిన నీలం ఓంకార స్వామి, మినియేచర్ ఆర్ట్ విభాగంలో పురస్కారం పొందిన మచ్చని శివ కేశవలను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.