W.G: పేదల వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఈతకోట తాతాజీ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణ కడగట్ల జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.