CTR: స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమైన మహిళా వ్యాపారాలు అభివృద్ధి కోసం రూపొందించిన ప్రత్యేకమైన కార్యక్రమం ‘సంపన్న కారి’ కార్యక్రమం అని చిత్తూరు డీఆర్డీఏ శ్రీదేవి తెలిపారు. సోమవారం సాయంత్రం చిత్తూరు డీఆర్డీఏ కార్యాలయంలో సంపన్న కారి కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీపీఎం రవి, ఏపీఎంలు సుబ్బారెడ్డి, మధు, రవి తదితరు పాల్గొన్నారు.