ప్రకాశం: పదవ తరగతి విద్యార్థులు రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి అన్నారు. శుక్రవారం వెలిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ కార్యక్రమంలో కాశిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.